వినాయక మండపాల్లో కార్పొరేటర్ మంజుల రెడ్టి ప్రత్యేక పూజలు

నమస్తే‌ శేరిలింగంపల్లి: కరోనా వ్యాధి నియంత్రణలోకి రావాలని, ఆది దేవుని చల్లని చూపులు ప్రజలందరి పైనా ఉండాలని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గణనాథున్ని వేడుకున్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్, విద్యానగర్, శివాజీ నగర్, వేమన కాలనీ, శ్రీలక్ష్మి శుభం అర్కేడ్ తో పాటు పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కార్పొరేటర్ మంజుల రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక మండపాల్లో పూజలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here