ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ 2 కోట్ల 7 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిలుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. మొదటగా నల్లగండ్ల లోని నవోదయ కాలనీ లో రూ.37.00 లక్షలతో సీసీ రోడ్లు, గోపనపల్లి, సోఫా కాలనీ లో రూ.50.00 లక్షలతో సీసీ రోడ్లు, ఖాజాగూడ లో సాయి ఐశ్వర్య కాలనీ, టెలికాంనగర్ కాలనీ ల‌లో రూ.38.00 లక్షలతో సీసీ రోడ్లు, టెలికాంనగర్ కాలనీ లో రూ.38.00 లక్షలతో స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్, వినాయక నగర్ లోని లక్మి ఎనక్లేవ్ లో రూ.44.00 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ కాలనీలలో ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలికమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here