విఘ్నేశ్వరునికి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించేలా చూడాలని, చేపట్టబోయే పనులకు విఘ్నాలు తొలగించాలని చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి విఘ్నేశ్వరున్ని వేడుకున్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను నవతా రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరానగర్ బస్తీ, బిక్షపతి ఎన్ క్లేవ్, తదితర కాలనీల మండప నిర్వహాకుల ఆహ్వానం మేరకు నవతా రెడ్డి మండపాలను సందర్శించి కాలనీ వాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ఆయా కాలనీల వాసులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

జవహర్ కాలనీ యూత్ సభ్యులతో వినాయక పూజలో పాల్గొన్న బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here