గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్ లోని లింగంప‌ల్లి రైల్వే స్టేషన్ 6వ నంబ‌ర్ ప్లాట్ ఫామ్‌కు స‌మీపంలో ఓ గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం మేర‌కు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వృద్ధుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వృద్ధుడి వ‌య‌స్సు సుమారుగా 65 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని, అత‌ను స్థానికంగా భిక్షాట‌న చేస్తుంటాడ‌ని, స‌రైన ఆహారం లేక తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెంది ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని వారు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here