భజరంగీ యువసేన మట్టి వినాయక విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ ఎక్స్ రోడ్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భజరంగీ యువ సైన్యం ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లోని వినాయక మండపాలను దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మట్టి వినాయకుని ప్రతిష్టించిన భజరంగీ యువ సైన్యం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలందరిని కాపాడి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డివిజన్ కన్వీనర్ పృథి కాంత్, కో కన్వీనర్ నవీన్, భజరంగీ యువ సైన్యం కమిటీ సభ్యులు శైలేష్, అరుణ్, సంతోష్, చిన్న, చెక్రి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here