శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరిగిన దాడికి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ పహల్గంలో కేవలం హిందువులే లక్ష్యంగా హిందువులపై జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా నాయకులు ర్యాలీ చేపట్టారు.