కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కేమెల్ లేఔట్, మాధవి హిల్స్, గోల్డెన్ తులిప్, పార్క్ ఎవెన్యూ, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ కాలనీలలో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి పిఏసి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీలో 30 లక్షల అంచనా వ్యయంతో, మాధవి హిల్స్ కాలనీలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, మార్తాండ్ నగర్ కాలనీలో 34 లక్షల‌ రూపాయల అంచనా వ్యయంతో, గోల్డెన్ తులిప్ కాలనీలో 51 లక్షల‌ రూపాయల అంచనా వ్యయంతో, కేమల్ లేఅవుట్ కాలనీలో 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ కాలనీలో 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, రాజరాజేశ్వరి నగర్ పార్క్ ఎవెన్యూ కాలనీలో 51 లక్షల‌ రూపాయల‌ అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొసరాజు లక్ష్మణ్, రిటైర్డ్ జడ్జి గోవింద్ రాజు, రేవతి, షేక్ చాంద్ పాషా, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పెరుక రమేష్ పటేల్, కరీం లాలా, ఇమామ్, మంగళరాపు తిరుపతి పటేల్, శ్రీనివాస్ చౌదరి, రజనికాంత్, కాశెట్టి అంజి, కొండల విద్యాసాగర్ రెడ్డి, ఎస్వీయన్ రాజు, విజయ్ శర్మ, గణపతి, తిరుపతి యాదవ్, గడ్డం ప్రశాంత్, సంజీవ, అభి అక్షయ్, అబ్దుల్ వసీం, కేత్, ముక్తార్, సమద్, జలీల్, మొహ్మద్ అలీ, ప్రవీణ్, నవీన్, గిరిధర్, అమర్నాథ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here