దివ్య శక్తి , ఆర్ డీబీ కొకనట్ అపార్ట్ మెంట్లలో .. వేడుకగా సీతారాముల కల్యాణోత్సవం

  • ముఖ్యఅతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శ్రీ రామ నవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, తదితరులు

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని దివ్య శక్తి, ఆర్ డీబీ కొకనట్ అపార్ట్ మెంట్లలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినాన ప్రజలందరూ సుఖ శాంతులతో గడపాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ బల్లా, అమిత్, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here