చందానగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో.. అంగరంగ వైభవంగా రాములవారి కల్యాణం

నమస్తే శేరిలింగంపల్లి :  చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5.30ని లకు శ్రీవారి సుప్రభాత సేవతో మొదలై.. 6.00 గం లకు నిత్యపూజలు బాలబోగం నివేదన హారతి, ఉదయం 10.30 ని లకు విష్వక్సేన పూజ పుణ్యాహవచనం అనంతరం 11.00 గం ల నుంచి సీతారామచంద్ర స్వామికి అంగరంగవైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించారు.

శ్రీ రాముల వారి కల్యాణోత్సవంలో తాళిని చూపిస్తున్న ఆలయ ఆచార్యులు

అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాద సమర్పణతోపాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భవాని మాత ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ దాత, ఆలయ ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు కల్యాణమహోత్సవానికి తలంబ్రాలు (ముత్యాలు) అందించారు. అంతేకాక ఆయనతోపాటు ఎం. సురేష్, విద్యావతి కేశవరవు అన్నప్రసాద వితరణ చేయించారు. భక్తులకోొసం ఆలయ ఉప ప్రధాన కార్యదర్శి కైలా దేవేందర్ రెడ్డి కళ్యాణ మండపం వేయించారు.  కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు సేవాసమితి సభ్యులు, అశేష భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి స్వామివారి హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

రాములవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here