గోపనపల్లి హనుమాన్ దేవాలయంలో… సీతారాముల కళ్యాణ మహోత్సవం

  • పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లిలోని హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు.

 

గోపనపల్లిలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేసిన కార్పొరేటర్ గంగాధర్ ెడ్డి

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక విలువను తు.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు అని అన్నారు. శ్రీరామనవమి ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గోపనపల్లి గ్రామస్థులు, భక్తులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

గోపనపల్లిలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here