భక్తి శ్రద్ధలతో శివలింగాలకు అభిషేకం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని గౌతమినగర్ వేముకుంటలోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయములో  కార్తీకమాసం అమావాస్య చివరిరోజు సందర్భంగా  మంగళవారం పుట్టమట్టితో 365 శివలింగాలను తయారు చేశారు.

శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయములో పుట్టమట్టితో చేపట్టిన 365 శివలింగాలతో శివుడికి అభిషేకం చేస్తున్న దృశ్యం

అనంతరం అభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని శివునికి అభిషేకం చేసి తమ భక్తిని చాటుకున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాగంణం కిటకిటలాడింది.

పూజలు చేస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here