పోలియో చుక్కలు వేయించి చిన్నారులను కాపాడుకుందాం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి : ఏ చిన్నారి పోలియో బారిన పడకుండా ఉండాలంటే పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి, స్థానిక నాయకులతో కలసి పలువురు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రధమ కర్తవ్యంగా తమ చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించటం మర్చిపోవద్దని అన్నారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

పోలియో మహమ్మారి వల్ల ఎంతోమంది జీవితాలు ఆగమ్యాగోచారం అయ్యాయని, ఈ రోజు అలసత్వం మన బిడ్డల రేపటి భవిష్యత్తు చీకటి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రూప రెడ్డి, డా రమేష్, మంగమ్మ, తిరుపతి యాదవ్, గిరిగౌడ్, యాదగిరి, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, మొహ్మద్ ఖాసీం, బాలకృష్ణ, శేఖర్ యాదవ్, షణ్ముఖ్, రమాదేవి, లక్ష్మి ప్రభ, సాహితీ, వేదాంషి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here