ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినం సందర్భంగా భారతినగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి కాలనీలోని లలిత పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మిర్యాల రాఘవరావు, బాలింగ్ గౌతమ్ గౌడ్, జనార్ధన్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్ రాజు, భాస్కర్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, నాగమణి, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here