రెండు కుటుంబాలకు ‘హోప్’ చేయూత

  • కుట్టు మిషన్లు అందచేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్

సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్ లక్ష్యమని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఆ క్లభ్ ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో రెండు కుటుంబాలకు కుట్టు మిషన్లను అందజేశారు.

కుట్టు మిషన్లు అందచేస్తున్న లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు

ఈ సందర్భంగా లయన్ కొండ విజయ్ మాట్లాడుతూ తమ క్లభ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహయం చేయడం కోసం క్లభ్ సభ్యులు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు దొంతి లక్ష్మీనారాయణగౌడ్, మందిరంగా కరుణాకర్ గౌడ్, గండి చెర్ల జనర్దాన్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

పుట్ట వినయ కుమార్  గౌడ్ తో కలిసి అన్నదానం చేస్తున్న లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here