- 20 వ తేదీ వరకు ఉత్సవాలు
- భక్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యుల పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ సహస్ర రుద్ర సహిత సహస్ర చండీయాగం ఘనంగా జరిగింది. శిల్ప ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత లక్ష్మీ గణపతి దేవాలయంలో చందానగర్ లోని అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని శ్రీ షిరిడి సాయి దేవాలయం సంయుక్తంగా జగద్గురువులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులతో ఈ చండీయాగాన్ని నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-5.40.02-PM-1.jpeg)
20వ తేదీ బుధవారం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయని ఆ ఆలయ ఫౌండర్ చైర్మన్, కమిటీ సభ్యులు ఎన్వి రమణ మూర్తి తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-5.40.02-PM.jpeg)
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు వేముల పవన్ కుమార్ శర్మ 9849185220, మురళీధర్ శర్మ 984929584లలో సంప్రదించాలని తెలిపారు.