- పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వ సత్యనారాయణ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్, మియాపూర్, చందానగర్, మాదాపూర్ డివిజన్లలో ఓంకార సేవ సమితి, శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్, శ్రీ లక్ష్మి నగర్ ఓనర్స్ అసోసియేషన్, సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గణపతి నవరాత్సోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆయా మండపాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వ సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్కె ప్రసాద్, నాగులు గౌడ్, సాయి రామ్ గౌడ్, కబీర్, సుహాస్ గౌడ్, యువతేజ్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మోహన్ గౌడ్, శ్రీధర్, మాణిక్ రావు, జగన్ గౌడ్, రవి గౌడ్, బాలు చౌదరి, బాలరాజు, వేణు, సురేష్, సతీష్, వెంకట్, ఆనంద్, శివ యాదవ్, లింగస్వామి, లోకేష్, శ్రవణ్, పవన్, రాహుల్, శివ, సాంబయ్య, గిరి, పృథ్వీ, ప్రశాంత్, రాణి మేడం, జయలక్ష్మి, మల్లికార్జున్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.