నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర నగర్ (122) డివిజన్ యువమోర్చ అధ్యక్షుడు సాయినాథ్ గౌడ్, కార్యదర్శి విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, కౌశిక్, ప్రమోద్, బూత్ అధ్యక్షులు మణిదీప్, యువమోర్చ కార్యకర్తలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, వారి బాధ్యతలకు రాజీనామా చేశారు.
ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డీకి అందజేశారు. అనంతరం రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం మార్పులకు అనుగుణంగా శేరిలింగంపల్లిలో రఘునాథ్ యాదవ్ గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.