యువత రాజకీయాలలో రాణించాలి..భవిష్యత్తు యువతరానిదే : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • హఫీజ్ పేట్ డివిజన్, శాంతి నగర్ నుండి బీజేపీలో చేరిన యువకులు, కాలనీ వాసులు
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వాహిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్, శాంతి నగర్ నుండి మన్యం, శ్రీను ఆధ్వర్యంలో వారి మిత్రులు, కాలనీ వాసులు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి రాష్ట్రం లో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుండి వస్తే హైదరాబాద్ కు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి వస్తుందని, అలాంటి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాల కల్పనలో కూడా వైఫల్యం అయిన ప్రభుత్వం మనకి అవసరమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ లైన్లు, మంజీరా పైప్ లైన్ ,ఇండ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు, స్కూల్స్ నిర్మాణం, పార్క్లు ఏర్పాటు, ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా కాపాడింది, ప్రతి బస్తి, ప్రతి కాలనీ అభివృద్ధి చేసింది బిక్షపతి యాదవ్ అని తెలిపారు. తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆదిత్య, శ్రీకాంత్, జగదీష్, శివ పాల్గొన్నారు.

గజమాలతో సన్మానం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here