కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ లోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్, వేముకుంట కాలనిలో రూ. 18 లక్షలతో చేపట్టిన భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను, కాలనీ వాసులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. Ghmc పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలనీ గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీవాసులు రవీందర్ రావు, యూసుఫ్ పాషా , అక్బర్ ఖాన్ , నారాయణ, రాజయ్య , ప్రేమ్ చంద్, జైరాజ్, చౌదరి, మీనా , పర్వీన్, సుల్తాన్, శ్రీనివాస్ , ఖాదర్ , జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ కృష్ణ, సురేందర్ పాల్గొన్నారు.

భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here