నమస్తే శేరిలింగంపల్లి : రిజర్వేషన్ల ప్రకటన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని, లేదంటే ఎలక్షన్స్ ఆపివేస్తామని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సంఘాలతో బేటి నిర్వహించి బీసీ కులాలకు 60 శాతం ఉన్న బీసీ ఓట్ల ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టాలన్నారు.
లేని పక్షంలో ఎలక్షన్స్ ఆపివేస్తామని బేరి రామచందర్ యాదవ్ తో పాటు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వీ శివకృష్ణ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఇమాపురం వెంకటేష్ గౌడ్గౌ మీడియాకు తెలిపారు. బీసీ సంఘాలు ఐక్యమత్యంగా ఉండి రానున్న రోజుల్లో సత్తా చాటుతామని చెప్పారు.