కాంగ్రెస్ కే ఓటు వేయండి

  • శేరిలింగంపల్లి అబ్జర్వర్, టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
  • రాఘవేంద్ర కాలనీ వద్ద ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వద్ద శేరిలింగంపల్లి అబ్జర్వర్, టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. వీరితోపాటు నియోజకవర్గ నాయకులు టి.కృష్ణ, రఘునాథ్ యాదవ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి తనయుడు పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here