కార్మికుల‌కు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి: డాక్టర్ తిప్పర్తి యాదయ్య

శేరిలింగంపల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ తిప్పర్తి యాదయ్య ప్రపంచ కార్మికుల మేడే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల ఉద్దేశించి మాట్లాడారు. శేరిలింగంప‌ల్లి జోన‌ల్ కార్యాల‌యం ఎదుట నిర్వ‌హించిన మేడే కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ కార్మికులు కష్టకాలంలో పని చేశారని కరోనా సమయంలో పనిచేశారని చాలీచాలని జీతంతో బతికీడుస్తున్నారని సరియైన జీతం లేక ఎన్నో సమస్యలకు కార్మికులు గురవుతున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్‌ నగరం పరిశుభ్రంగా ఉంటుందని, వారి శ్రమను గుర్తించి కార్మికులకు కావలసిన సేఫ్టీ కిట్లను ఇవ్వాలని, వారికి ప్రత్యేక కార్పొరేషన్ చేసి జీతాలు ఇవ్వాలని అన్నారు. ఇదే జీతానికి గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారని, ఈ జీతం సరిపోక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, రోడ్లు ఊడ్చే వారి బ్రతుకులు రోడ్డు మీదనే తెల్లారుతున్నాయని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here