క్రీడాకారుల‌కు ప్ర‌భుత్వం ఎల్ల వేళ‌లా ప్రోత్సాహం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో అథ్లెటిక్స్ NIS ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ MV ప్రసాద్ ఆధ్వర్యంలో Muddanas తెలంగాణ ఓపెన్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కార్యక్రమానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అథ్లెటిక్స్ NIS ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ MV ప్రసాద్ ఆధ్వర్యంలో Muddanas తెలంగాణ ఓపెన్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత‌ ఇస్తుందని, క్రీడాకారులకు తగిన సదుపాయాలు ఉన్నాయని, అన్ని క్రీడలకు, క్రీడాకారులను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here