శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ ఆఫీస్ ఎదుట ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా చందానగర్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ హాజరై జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రతిసారి మేడేను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయమని తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే వారు కలిసికట్టుగా ఐక్యంగా ఉండి వారికి రావలసిన సేఫ్టీ కిట్టు లాంటివి అడగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఏ సమయంలోనైనా వారికి తాను అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ కొమ్ము పరమేష్, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు నాగేశప్ప, గురు చరణ్, నాగరాజు, మహేష్, మల్లయ్య, ఉప్పలయ్య, వెంకన్న, డేవిడ్, మహిళా కార్మికులు, మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.