నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య రామజన్మ భూమిలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా భారత దేశం మొత్తంగా ప్రతి ఇంటికి శ్రీ సీతరాముల వారి అక్షింతలు అందచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లక్ష్మీ విహార్ కాలనీలో కమిటీ అద్యక్షులు రవీంద్ర ప్రసాద్ దూబే ఆధ్వర్యంలో కాలనీ వాసులంత సంప్రదాయబద్దంగా పల్లకిలో సీతా రాముల ప్రతిమలతో , బాజాబజంత్రీలు, మేల తాలాలతో రామభజన చేస్తు ఉరేగింపు నిర్వహించారు.

ప్రతి ఇంటికి అక్షింతలు ఇచ్చి ఆధ్యాత్మిక కళా మండపం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవీంద్ర ప్రసాద్ దూబే, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాద్యాక్షులు నర్సింహారావు, కార్యదర్శులు సరిత, మాధవి, సత్యనారాయణ రాజు, విద్యాసాగర్, కాలనీ వాసులు రామ మూర్తి, కరుణాకర్ గరు పాల్గొన్నారు.