ఆదివారం టీఆర్ఎస్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 31 న ఆదివారం ఉదయం 10 గంటలకు మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ కమిటీ ప్రతినిధులు, పార్టీ శ్రేయభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి హాజరయ్యే ప్రతీ కార్యకర్త పార్టీ కండువాతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలని కోరారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here