రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సబ్ స్టేషన్ పరిధిలో‌ కొత్త ఫీడర్ కేబుల్ పనులు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు పలు కాలనీలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లను‌న్నట్లు ఏఈ ఎం. సురేందర్ తెలిపారు. రైల్ విహార్ నుంచి కొత్త ఫీడర్ కేబుల్ పనులు కన్ స్ట్రక్షన్ వింగ్, చెట్ల కొమ్మలు తొలగించనున్నట్లు చెప్పారు. 11కేవీ రైల్ విహార్ ఫీడర్ పరిధిలోని రైల్ విహార్ కాలనీ, రామయ్య కాలనీ, హుడా ట్రేడ్ సెంటర్, ఓల్డ్ లింగంపల్లి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెల్లడించారు. ఆయా కాలనీల వాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here