ధర్మపురి క్షేత్రం చావడి అనాథ వసతి గృహంలో ప్రవేశాలకు ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రం చావడి అనాథ వసతి గృహంలో ప్రవేశాలు ప్రారంభించినట్లు చావడి చైల్డ్ వెల్ఫేర్ అధ్యక్షుడు డి.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు‌. తల్లి దండ్రులు లేని నిరుపేదలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్య, వసతి, దుస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు. అవసరమైన వారికి వైద్యం కూడా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9908507838, 8186867278 నంబర్లను, మియాపూర్ దీప్తి శ్రీ నగర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రం ఆలయంలో సంప్రదించవచ్చన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here