ఆదివారం కాప్స్ రాక్స్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

నమస్తే శేరిలింగంపల్లి: కాపు కులస్తుల కాప్స్ రాక్స్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల‌ 31 ఆదివారం ఎస్ ఎన్ రెడ్డి గార్డెన్స్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని విజయ రాఘవ కన్ స్ట్రక్షన్స్ అధినేత, బిల్టర్ మిరియాల రాఘవరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాపు రాక్స్ కు చెందిన వారు 60 వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మొట్ట మొదటి సారిగా కాపు రాక్స్ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, పవర్ పాయింట్ ప్రజంటేషన్, ముఖ్య అతిథుల ఉపన్యాసాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని రాఘవరావు వెల్లడించారు. మరిన్ని వివరాలకు కంభంపాటి‌ జ్ఞానేశ్వర్ సెల్ నం 9885991999, గణిశెట్టి శివసత్యం 7989937181 ను సంప్రదించాలన్నారు. కాపు రాక్స్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఆత్మీయ సమ్మేళనంలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాపు రాక్స్ ఆత్మీయ సమ్మేళనం ఆహ్వాన పత్రిక
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here