ఘనంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదిన వేడుక.. శుభాకాంక్షల తెలిపిన భేరీ రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ముందు ముందు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా బంజారా సమితి అధ్యక్షులు హనుమంతు నాయక్, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, ఉపాధ్యక్షులు ఎండి కమర్ పాషా, గోపాల్ యాదవ్, గణేష్ నాయక్, రిపోర్టర్ షఫీక్ , రిపోర్టర్ విజయ్, బాలరాజ్ సాగర్ , నాగరాజు , భరత్ లవణాచారి , నేతాజీ నగర్ యూత్ ప్రధాన కార్యదర్శి భవన్ డీజే ,సాయి తేజ, సాయి సాగర్, శ్రీనివాస్ , అశోక్ , రాజు, బాలీష్ ,దినేష్, కుమార్, ప్రశాంత్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్దలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షల తెలిపిన నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here