నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా శారీమేళా ఆకట్టుకుంటున్నది. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కళాకారులు తమ చేనేత ఉత్పత్తులతో శిల్పారామంలో కొలువుదీరారు. ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను మహిళల కొనుగోలు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఒడిసి నృత్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కోల్ కతా నుండి విచ్చేసిన ఒడిసి నృత్య కళాకారులు శ్వేతా కుందు, అనుష్క రాయ్, సంపూర్ణ రాయ్, శ్రీ చక్రబర్తి, తీస్తా సర్కార్ జగన్నాథ్ వందన, మంగళ చరణ్, బసంత్ పల్లవి, దశావతారాలు, మోక్ష పలు అంశాలను ప్రదర్శించారు. కూచిపూడి నృత్యంలో కందుల కూచిపూడి నాట్యాలయం గురువు రవి కూచిపూడి శిష్య బృందం “దేవి వైభవం” నృత్య రూపకం ఆధ్యంతం అలరించింది. నవ్య దీపికా, శాన్వి, మణిమాల, వర్ష, ప్రియ, హంసిని, సురుచి, లాస్యప్రియ, మధులిక శ్రీ, సరయు, నికిత సాయి ప్రదర్శించి మెప్పించారు.