గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ప్ర‌శాంతంగా సాగేలా చూడాలి: జోన‌ల్ కమిష‌న‌ర్ ఉపేంద‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోన్ ప‌రిధిలోని మల్కం చెరువు, గోపీ చెరువు, నల్లగండ్ల చెరువు, గంగారం, గుర్నాథం బేబీ పాండ్, కైదాం కుంట, దుర్గం చెరువుల వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించిన‌ ఏర్పాట్లను జోన‌ల్‌ కమిషనర్ ఆర్.ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఈ, డీసీలు, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఈఈలు, డీడీఈలు, ఏఎంవోహెచ్‌లు, శానిటరీ సూపర్‌వైజర్లు, రామ్‌కీ ఏజెన్సీ బృందం, ఎంట‌మాల‌జీ సిబ్బంది పాల్గొన్నారు.

గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్న జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్ రెడ్డి

ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి చెరువు వద్ద తగిన బృందాలు, యంత్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు అన్ని కార్యాచరణలను సమన్వయంతో అమలు చేసేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పండుగ సందర్భంగా సురక్షితమైన, పర్యావరణహితమైన నిమజ్జనం కోసం శానిటేషన్ సిబ్బంది, ఫాగింగ్ యంత్రాలు, ఎలక్ట్రికల్ బృందాలు, ఇతర అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here