వైభవంగా ఫలహారం బండ్ల ఊరేగింపు… పాల్గొని పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లో బోనాల పండుగను పురస్కరించుకొని ఫలహారం బండ్ల ఊరేగింపు ఏర్పాటు చేశారు. తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయం, నెహ్రు నగర్ తోపాటు పలు బస్తీలలో ఏర్పాటు చేసిన ఫలహారం బండ్ల ఊరేగింపు వేడుకగా జరిగింది.

ఈ ఊరేగింపులో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరిలో ఉత్సాహం నింపారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువత కేరింతల నడుమ ఫలహార బండ్ల ఊరేగింపు కనువిందుగా సాగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..ప్రపంచంలోని నలుమూలలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి, భక్తిశ్రద్ధలతో అమ్మ వారిని కొలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ ఎల్ల వేళలా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కవిత గోపాల కృష్ణ, సీనియర్ నాయకులు రాంచందర్, యాదా గౌడ్, రామ చారీ, రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, దేవులపల్లి శ్రీకాంత్, రవి, బీమన్ శ్రీను, వెంకటేష్, బాలాజీ, పాండు ముదిరాజ్, సంతోష్, మహేందర్ సింగ్, ప్రదీప్, భీమ్ సింగ్, శ్రీపాల్, అంబు, రఘు, జ్ఞానేశ్, తుకారాం నిర్వాహకులు నరేష్, హరీష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here