ఫలహారం బండి ఊరేగింపులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్ నగర్ కాలనీలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్ నగర్ కాలనీలో బోనాల ఉత్సవంలో పాల్గొని పోతరాజులతో కలిసి నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని, బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, విక్రమ్, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here