బీఆర్‌ఎస్‌కు బండి రమేష్ గుడ్ బై… రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోచేరిక…

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ లో కొనసాగుతున్న కాంగ్రేస్ పార్టీ బస్సు యాత్రలో ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బండి రమేష్ కు కండువాకర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ, పక్కన రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు

కుకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి రమేష్..?

కాంగ్రేస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బండి రమేష్ ఆశీసుస్తుండగా ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ సీటు ఖరారైన నేపథ్యంలో కుకట్ పల్లి నుండి బరిలో దించేందుకు ఆ పార్టీ అధీష్టానం సిద్ధమైనట్టు సమాచారం. ఏదేమైనా అటు జగదీశ్వర్ గౌడ్ దంపతులు ఇటు బండి రమేష్ లు పార్టీని వీడటంతో శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పొచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here