ఓట్లు వేసి ఆశీర్వదించండి.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి :  పాపి రెడ్డి కాలనీవాసులకు పట్టాలు, పేదవారికి ఇండ్లు ఇప్పిచ్చిన ఘనత మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ దే అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో అభివృద్ధి ఆగమైందని, అన్యాయం విలయతాండవం చేస్తున్నదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు.

డబల్ బెడ్ రూమ్ ఇల్లు,  పెన్షన్స్, రేషన్ కార్డ్స్, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో కాలనీవాసులు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని రానున్న కొద్ది రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే  యుద్ధ ప్రాతిపదికన సమస్యలన్నీ పరిష్కరిస్తానని కాలనీవాసులకు మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, రమేష్, అనిల్ కుమార్ యాదవ్, నరసింహ, శ్రీనివాస్, బీరప్ప, భాస్కర్, నర్సింగ్ యాదవ్, రాజేష్ ,ఇమ్రాన్ , అఖిల్ శ్యామ్ , విజయలక్ష్మి, అరుణ, సుశీల, లక్ష్మి, జ్యోతి శ్యామ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here