చందానగర్ డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించండి: కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ ప‌రిధిలోని వివిధ కాలనీల‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆమె డీసీకి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి మాట్లాడుతూ కాలనీలలో ఉన్న పార్క్ ల‌ను అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే నాలాల్లో చెత్త వేయకుండా చూడాల‌న్నారు. నాలాల వ‌ద్ద ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. గౌతమి నగర్ కాలనీలో ఉన్న ఈద్గాకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫ్లోరింగ్ చేయాలని అన్నారు. డివిజన్ లో వివిధ కాలనీలలో సీసీ రోడ్లు, ఎస్‌డ‌బ్ల్యూడీ నిర్మాణం ప‌నుల కోసం నిధులు మంజూరు చేయాల‌న్నారు. అలాగే నిధులు మంజూరైన పనులను త్వరగా మొదలు పెట్టి పూర్తి చేసేలా చూడాలని కోరారు.

please solve problems in chandanagar corporator navatha reddy requested dc sudhansh
డిప్యూటీ క‌మిష‌న‌ర్ సుధాంష్‌కు వినతిప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here