నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదినాన్ని ఆయా డివిజన్ లో బిఆర్ ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అంతేకాక పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులకు గొడుగుల పంపిణీ చేశారు.
గొడుగులు పొందిన కార్మికులు మాట్లాడుతూ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గొడుగులు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి పుట్టిన రోజు వేడుకగా జరుపుకోవాలని అన్నారు. బిఆర్ ఎస్ నాయకులు, గోల్కొండ రాజు, తిమ్మరాజు, శంకరయ్య, పాల్గొన్నారు.