- గోపిచెరువు సరిహద్దు కట్ట తెగి ఉద్తృతంగా నీటి ప్రవాహం
- నిలిచిన రాకపోకలు
- సిపి స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ సందీప్ రావుతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు గోపిచెరువు సరిహద్దు కట్ట తెగి వరద నీటి ప్రవాహం పోటెత్తింది. దింతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యను సిపి స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ సందీప్ రావుతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఉప్పొంగుతున్న వరద నీటి సమస్యకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సూచించారు. రోడ్డు వైడనింగ్ గురించి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.