ఆ స్పెష‌ల్ భోజ‌నం మీరు తిన‌గ‌లిగితే.. ఎంచ‌క్కా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇస్తారు..

క‌రోనా వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అయితే త‌న వ్యాపారాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు గాను ఆ హోట‌ల్ య‌జ‌మాని ఒక అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించాడు. అదేమిటంటే..

మ‌హారాష్ట్ర‌లోని పూణెలో ఓల్డ్‌ ముంబై – పూణె హైవేపై వడ్‌గావ్‌ మవల్‌ అనే ప్రాంతంలో శివరాజ్ హోట‌ల్‌‌ ఉంది. అందులో రూ.2500కు బుల్లెట్ థాలి పేరిట స్పెష‌ల్ భోజ‌నం ల‌భిస్తుంది. అందులో ప‌లు ర‌కాల డిషెస్ ఉంటాయి. ఆ భోజ‌నాన్ని 7 మంది తినొచ్చు. కానీ దాన్ని ఒక్క గంట‌లోగా ఒక్క వ్య‌క్తి తినాలి. అలా తింటే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహ‌నం ఇస్తారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ఆ చాలెంజ్‌ను స్వీక‌రించారు. కానీ ఒక్క వ్య‌క్తి మాత్ర‌మే ఆ భోజ‌నం తిని బుల్లెట్‌ను గెలుచుకున్నాడు. ఆ హోట‌ల్ వారు ఇలా చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here