నమస్తే శేరిలింగంపల్లి : యోగా వెలకట్టలేని అమూల్యమైన భారతీయ సంప్రదాయం, యోగాసనాలతోనే శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్, మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలలో బొటానికల్ గార్డెన్స్ యోగా గురువు బల్విందర్ సింగ్ యాదవ్, ఆయన టీమ్ సభ్యులు, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులతో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన వరుమ ఈ కామర్స్ (ఆన్లైన్ క్లాత్స్) సంస్థ వారి యోగా డే స్పెషల్ టీ షర్ట్స్, బ్రౌచర్ , ఆవిష్కరించారు. ప్రతీ ఒక్కరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలపడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో రాజు శెట్టి, సీనియర్ నాయకులు ఆకుల లక్ష్మణ్, జితేందర్, గోవర్ధన్ రెడ్డి, గణేష్ , శివాసింగ్, శివరాజ్ , శ్రీను.జే, రవి నాయక్, పద్మ, వరలక్ష్మి, మేరీ, రేణుకా, పార్వతి, భాస్కర్, వంశీ, అశోక్, భాస్కర్, నవీన్ రెడ్డి,గోపాల్, ఉమేశ్వర్, నరసింహ యాదవ్, శ్రీనివాస్ , నరేష్, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.