శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపవాస దీక్షలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బురాన్, తాహెర్, ఖాదర్ ఖాన్, మక్బూల్, అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






