రహదారి అభివృద్ధి హామీపై సంక్షేమ సంఘ నాయకుల హర్షం

మేయర్ బొంతు రామ్మోహన్ ను సన్మానిస్తున్న చందానగర్ గృహ సంక్షేమ సంఘాల సభ్యులు.

చందానగర్ డివిజన్ పరిధిలోని పాత ముంబై రహదారితో పాటు సమీప రోడ్ల అభివృద్ధి గురించి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి ల హామీపై పలు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనుల నిమిత్తమై మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక శాసన సభ్యులు అరికెపుడి గాంధీ, కార్పొరేటర్ నవత రెడ్డిలు కాలనీ వాసులతో కలిసి ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకులు రాపోలు విశ్వాస్ రెడ్డి, దొంతి లక్ష్మినారాయణగౌడ్ లు మాట్లాడుతూ పాత బాంబే రహదారిపై యధావిధిగా అభివృద్ధి పనులు కొనసాగించడంతో పాటు, శ్రీదేవి థియేటర్ ముందుగల రహదారిని విస్తరించి లింగంపల్లి చౌరస్తాతో అనుసంధానం చేసే విషయమై తాము నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, కొర్పొరేటర్ నవతరెడ్డిలకు గతంలో విన్నవించామని తెలిపారు. తమ అభిప్రాయాలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ, కార్పోరేటర్ నవతరెడ్డిలు త్వరలోనే విస్తరణ పనులను చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోడ్డులో గల ద్విచక్ర వాహన వ్యాపారులు సైతం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారన్నారు. తమ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ లకు గృహ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here