శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాధాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ చందానగర్లోని పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ల క్రీడోత్సవం 2025 లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనశైలి, స్నేహభావం, నాయకత్వ విలువలను ప్రోత్సహించేందుకు నిర్వహించబడిందన్నారు. గెలుపు లేదా ఓటమికంటే పాల్గొనడం గొప్పది అనే సందేశాన్ని ఈ క్రీడలు అందిస్తున్నాయన్నారు. ఆటలో స్పూర్తి మిన్న, విజయం కన్నా విలువైనది అని పేర్కొన్నారు.