రంజాన్ తోఫాను అందజేసిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింమైనార్టీ సోదరుకు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రంజాన్ తోఫాను మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ముస్లింలకు అందజేశారు. తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏకే.బాలరాజు, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తి అధ్యక్షుడు ముక్తర్, సత్యనారాయణ, రామకృష్ణ, భుజంగం, అంకా రావు, నర్సింహా, మహిళ అధ్యక్షురాలు మొగులమ్మ, మహిళలు శ్రీజ రెడ్డి, రేఖ, అమినా బేగం తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ బట్టలను అందజేస్తున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here