నేతాజీ నగర్ సాయినాథుని ఆలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ సాయిబాబా దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని సాయిబాబా వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని, గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్, రాఘవేంద్ర శర్మ, సత్యనారాయణ ముదిరాజ్, వెంకటేశ్వర్లు, బొట్టు కుమార్, సీనియర్ నాయకులు రాయుడు, నర్సింగ్ నాయక్, ప్రకాష్, నరేందర్ నాయక్, గోవర్ధన్ నాయక్ , స్థానిక నేతలు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here