వేడుకగా దత్తాత్రేయ జయంతి.. ప్రత్యేక పూజలు చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ సాయిబాబా దేవాలయంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు వేడుకగా జరగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని సాయిబాబా స్వామికి, ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం, మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జేపీ నగర్ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వీరేందర్ గౌడ్, సాంబశివరావు, దినేష్, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ప్రసాద్, మహేశ్వర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, మాధవి రెడ్డి, ఉట్టి నరేందర్, గడ్డం మాణిక్యం రెడ్డి, సురేష్, మహిళలు పాల్గొన్నారు.

స్వాగతం పలుకుతున్న ఆలయ ఆచార్యులకు నమస్కరిస్తున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here