క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బాలింగ్ గౌతమ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : క్రిస్టమస్ పండగ పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ &యూత్ కాలనీ లోని నాయకులు సుదీష్ అధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు.

సాయినగర్ &యూత్ కాలనీ లో చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేకు కట్ చేస్తున్న బాలింగ్ గౌతమ్ గౌడ్

జాన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

బాలింగ్ గౌతమ్ గౌడ్ కు సన్మానం

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, జమీర్ లిమ్రా, సాబేర్, శ్రీధర్, రెడ్డి, బాలరాజు, విజయ్ సాగర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here