నమస్తే శేరిలింగంపల్లి : క్రిస్టమస్ పండగ పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ &యూత్ కాలనీ లోని నాయకులు సుదీష్ అధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-6.41.49-PM.jpeg)
జాన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-6.41.49-PM-1.jpeg)
ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, జమీర్ లిమ్రా, సాబేర్, శ్రీధర్, రెడ్డి, బాలరాజు, విజయ్ సాగర్ పాల్గొన్నారు.