క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ : జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని జై హింద్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని తెలిపారు.

జై హింద్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మాట్లాడుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

ఏసు ప్రభు మార్గదర్శకం చేసినట్లుగా అందరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

జై హింద్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న క్రైస్తవ సోదరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here