గుర్తు తెలియని వృద్ధుడు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని సోమవారం ఉదయం రోడ్డు ఊడుస్తున్న జీహెచ్ఎంసీ స్వీపర్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండొచ్చని, బిక్షాటన చేసుకునే వ్యక్తిలా అనుమానిస్తున్నారు. మృతుని ఎత్తు సుమారు 5 అడుగుల 2 అంగుళాలు, నలుపు చాయా, తెల్లని గడ్డం, మాసిపోయిన జుట్టు ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here